గుంటూరు నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు నగర కమిషనర్ కె. మయూర్ ప్రజారోగ్య అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైన్లలో వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి వంద శాతం తడి, పొడి చెత్త సేకరించాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు కమిషనర్ సూచించారు.