SKLM: పాతపట్నం రైల్వే స్టేషన్లో రాజారాణి ఎక్స్ప్రెస్ ట్రైన్ హాల్ట్ను శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ హాల్ట్తో ఈ ప్రాంత ప్రజల చిరకాల కల సాకారమయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.