NTR: ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి మూసివేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల నుంచి ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, ఉదయం 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి.