కోనసీమ: ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఉప్పలగుప్తం పరిసర సముద్ర తీరంలో వేటపై నిషేధం విధిస్తున్నట్లు మత్స్యశాఖ అధికారి చలపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు రెండు నెలల పాటు ఈ నిబంధన అమలులో ఉంటుందన్నారు. చేపలు పునరుత్పత్తి సమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, వేట నిలిపివేసిన కాలంలో మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.