KRNL: చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తరఫున ప్రతినిధులు 19 మంది మరణించిన వారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన 4 గురికి రూ. 50వేల చొప్పున మొత్తం రూ. 40లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సిరి సమక్షంలో అందజేశారు.