KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ తెలిపారు. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తలనీలాలకు, కొబ్బరికాయల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండి ఆలయ మాజీ చైర్మన్లు వెంకటస్వామి, భాస్కర్ పాల్గొన్నారు.