SKLM: పోలాకి మండలం మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకుని బుధవారం రాత్రి నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృ ష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పులు, వాతావరణం, రాజకీయ, సామాజిక అంశాలపై శృంగవరపు లక్ష్మీ ధనుంజయశర్మ పంచాగ పఠనంలో తెలియజేశారు. అనంతరం జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.