ELR: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.