కోనసీమ: ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను బుధవారం అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలో తిరగాలని ఆకాంక్షించారు.