NTR: విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో టీఎన్ టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ కేసినేని చిన్నిపై సాక్షి పేపర్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధి కోసం ఎంపీ కేసినేని చిన్ని నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయనపై బురద జల్లుతున్నారని తెలిపారు.