VZM : విజయనగరంలోని స్థానిక ఓ హోటల్లో ఈరోజు ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా’.. అనే పాటను MSME కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర చరిత్రను ఆటపాటల రూపంలో ప్రజలకు అందించిన కవి వంగపండు అన్నారు. ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద్కు డాక్టరేట్ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదాడ మోహన్, రవితేజ, తదితరులు పాల్గొన్నారు.