E.G: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం “ఆంధ్రప్రదేశ్ ఆటవిడుపు – 2026” క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. నిడదవోలు MLA కందుల దుర్గేశ్ ఈ పోటీల్లో పాల్గొని టగ్ ఆఫ్ వార్, రన్నింగ్, కబడ్డీ ఆడి అలరించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకలో పలువురు MLAలు, MLCలు పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.