బాపట్ల: బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ హాజరయ్యారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.