KRNL: పెద్దకడబూరు మండలంలోని నాగలాపురం గ్రామానికి చెందిన 2007–2008 యస్.యం.కె.వి ఉన్నత పాఠశాల పదవ తరగతి బ్యాచ్ మిత్రుడు బి. కేశవప్ప అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్యాచ్ మిత్రులు రూ. 36,500లను సమీకరించి గురువారం సహాయంగా అందజేశారు. అదేవిధంగా దేవాలయం వద్ద తీసుకున్న రూ. 6,500 అప్పును కూడా తీర్చారు.