GNTR: కంకరగుంట రైల్వే ఫ్లైఓవర్ కింద ఉన్న ‘పీకల వాగు’ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయింది. దీనివల్ల మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. కాలువలో పెరిగిన దోమలు, ఈగల వల్ల స్థానికులు జ్వరాలు, వైరల్ వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కాలువను శుభ్రపరచాలని శుక్రవారం స్థానికులు కోరారు.