కృష్ణా: మచిలీపట్నం 8వ డివిజన్లో మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే కాలంలో మచిలీపట్నం పోర్టు పూర్తై, యువతకు అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.