E.G: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని డీటీవో ఎన్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా ఖజానా కార్యాలయంలో ఈ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. గడువులోగా ధ్రువీకరణ పత్రాలు అందజేయని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.