SKLM: బూర్జ మండల పరిషత్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీటి వనరులను గుర్తించడం, నీటి నాణ్యత పరీక్షలు, క్లోరినేషన్ క్రమం తప్పకుండా నిర్వహించాలని తెలిపారు.