కృష్ణా: మచిలీపట్నంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో మాతృ మరణాలను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై DHMO యుగంధర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మాతృ, శిశువు మరణాలను తగ్గించడం కోసం వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా సమన్వయంతో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.