KDP: బద్వేలు మండల MRO కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు MRO ఉదయ్ భాస్కర్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు RDO చంద్రమోహన్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని ఆయన కోరారు.