ATP: గుత్తి గేట్స్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మంగళవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ సర్కిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో గేట్స్ ఎండీ రఘునాథ్ రెడ్డి, డైరెక్టర్ వాణి మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి నడవాలని సూచించారు.