MBNR: వికలాంగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వికలాంగ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. వికలాంగుల పెన్షన్ను రూ. 6,000 పెంచాలని, అలాగే వికలాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలని అన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులలో కూడా అవకాశాలు కల్పించాలన్నారు.