SKLM: విద్యతోనే జ్ఞానం లభిస్తుందని, జ్ఞానం సమాజ అభివృద్ధికి పునాది అని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎస్పీ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశానికి కలాం చేసిన సేవలను స్మరించుకున్నారు.