KRNL: బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉలిందకొండ పీఎస్లో ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్పై 281, 125(A), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాను, శివశంకర్ మద్యం సేవించామని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని తెలిపాడు. శివశంకర్ స్పాట్లోనే మృతిచెందగా.. తాను ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నాడు.