ప్రకాశం: కనిగిరిలో ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ యాదవ్ ఆదివారం సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీకి తరలిరావాలన్నారు.