సత్యసాయి: పెనుకొండలోని వైసీపీ కార్యాలయంలో జిల్లాస్థాయి బూత్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నిర్మాణం కీలకమని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సమర్థవంతమైన బృందాలు ఏర్పాటు చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ దీపిక పాల్గొన్నారు.