TPT: అనంతపురానికి చెందిన వీఎస్ రవి కుమార్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంగా డీడీని అందజేశారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతను, కుటుంబ సభ్యులను అభినందించారు.