NTR: ఈ నెల 25న దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని కలెక్టరేట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.