NLR: బుచ్చి(M) రెడ్డిపాలెం గ్రామంలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీజేపీ రూరల్ మండల ఉపాధ్యక్షులు పెంచలకృష్ణ ఆ పార్టీ నేతతో కలిసి ఎంపీడీవోకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రహదారికి లోతట్టు ప్రాంతంలో శ్మశాన వాటిక ఉండడంతో చుట్టుపక్కల పొలాల నుంచి నీరు ఊరుతూ అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉందన్నారు. శ్మశాన వాటికలో గ్రావెల్తో చదును చేయాలన్నారు.