BPT: కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెంలోని ఎస్సీ కాలనీ నందు పారిశుధ్యం అధ్వానంగా మారింది. స్థానిక ప్రాథమిక పాఠశాల రోడ్డు నందు సైడ్ కాలువలు లేక మురుగునీరు పేరుకుపోయింది. దీంతో మురుగునుండి వస్తున్న దుర్వాసనతో తమ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.