అన్నమయ్య: చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో ఉన్న తన మేనమామ లోమడ చిన్న గంగిరెడ్డిని ఆదివారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. చిన్న గంగిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఈ విషయం తెలుసుకున్న మంత్రి చక్రాయపేటకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సిద్ధారెడ్డిపల్లె వాసులు ఆయనకు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.