సత్యసాయి: పెనుకొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) పాఠశాలను మంత్రి సవిత సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెరుగైన విద్యా ప్రమాణాల కోసం కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.