ASR: రాజముద్రతో ముద్రించిన పట్టా పాసు పుస్తకాల వల్ల, రైతులకు తమ భూమిపై పూర్తి హక్కు లభిస్తుందని పాడేరు ఏఎంసీ ఛైర్మన్ మంగతల్లి అన్నారు. శుక్రవారం కొయ్యూరు మండలం పుట్టకోటలో తహసీల్దార్ పీ.మురళీ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టా పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 17మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.