ATP: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ప్రాంగణంలో ఈవారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ. 3.83 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ రాఘవేంద్రకుమార్ తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ. 2.40 లక్షలు, ఆదివారం జరిగిన పశు వులు, గేదెలు, ఎద్దుల సంత ద్వారా రూ. 1.43 లక్షలు వసూలైనట్లు తెలిపారు.