E.G: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ (BSP) జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్ర సేను మాట్లాడుతూ క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ లకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.