ATP: నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. గత 10 నెలలకు గాను రూ. 28.11 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శోభ వెల్లడించారు. నగదుతో పాటు 17 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.