GNTR: గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనను ఇప్పటివరకు సుమారు 80 వేల మంది సందర్శించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సైతం ఈ ప్రదర్శనను వీక్షించి నిర్వాహకులను అభినందించారు. వైద్య విజ్ఞానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిన ఈ ప్రదర్శనను చివరి రోజైన శనివారం తప్పక చూడండి.