ELR: ఈనెల 23న జరుగుతున్న చలో విజయవాడ ప్రదర్శన, మహా ధర్నా కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఐఎన్టీయూ ఏలూరు నగర అధ్యక్షులు బి.సోమయ్య పిలుపునిచ్చారు. ఇవాళ జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే లాగా ఉన్నాయన్నారు.