ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి శనివారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.