NLR: సుదూర ప్రాంతాలకు ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని గురువారం ఉదయగిరి డిపో మేనేజర్ రమేష్ కుమార్ తెలిపారు. మార్కాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురవడం విచారకరమన్నారు. ఉదయగిరి డిపో నుంచి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.