SKLM: టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. టీడీపీ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటుతూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పోరడతుంది.