ASR: దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పాడేరులో నిర్వహించిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్కో రైతుకు రూ.6,000 చొప్పున అల్లూరి జిల్లాలో 1,03,864 మంది రైతుల ఖాతాల్లో రూ.62.32 కోట్లు జమ అయినట్లు పేర్కొన్నారు.