KKD: టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడును అన్నవరం దేవస్థానం నూతన ఈవో సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం అన్నవరం దేవస్థానం నూతన కార్యనిర్వాహణ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా యనమలను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు.