AKP: పాయకరావుపేట ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత లోపించిందని వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు శుక్రవారం ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ అధ్యక్షుడు చించెలపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పరహాలబాబు మాట్లాడుతూ.. అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పనులపై క్వాలిటీ కంట్రోల్ అధికారులు విచారణ జరుపుతున్నారన్నారు.