ATP: గుత్తిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతిపత్రం అందజేశారు. మండల అధ్యక్షులు వెంకప్ప, జిల్లా నాయకులు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ను కోరినట్లు చెప్పారు.