TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.