విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఇక నుంచి కొత్త జంతువులను చూడవచ్చు. అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి జంతు మార్పిడి జరగడంతో గురువారం పలు జంతువును తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాలయన్ బ్లాక్ టేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియస్ పామ్ సివెట్ ఇక్కడకు చేరుకున్నాయి.