ASR: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆదివారం విమర్శించారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి “మన ఎమ్మెల్యే.. మా ఊరు” పేరుతో పంచాయతీలను సందర్శిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులతో కలిసి నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.