NTR: ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. మంగళవారం ఉదయం వీది కుక్క బాలుడుపై దాడి చేసింది. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలపై వీధి కుక్కలు దాడి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.