తిరుపతి రూరల్ మండల పరిధిలోని పద్మావతి పురంలో మంగళవారం గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.